ముంబై: రెండు రోజుల క్రితం లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ ఓ తీర్పునిచ్చింది. మహిళల శరీరానికి శరీరం తాకితేనే అది లైంగిక వేధింపుల కేసు కిందకు వస్తుందని, అలా కాకుండా ఆమె దుస్తులను తాకినంత మాత్రాన అది లైంగిక వేధింపుల కిందకు రాదని సంచలన తీర్పునిచ్చింది. సింగిల్ జడ్జ్ బెంచ్ న్యాయమూర్తి పుష్ప గనేదివాల ఈ తీర్పును వెలువరించారు.

మైనర్ల విషయంలో వచ్చిన ఓ కేసులో న్యాయమూర్తి ఈ తరహా తీర్పు ఇచ్చారు. మైనర్లను ఎవరైనా తాకినంత మాత్రాన, అందులోనూ వారి ఎద భాగాన్ని దుస్తుల పైనుంచి తాకినంత మాత్రాన అది లైంగికంగా వేధించినట్లు కాదని పేర్కొన్నారు. వారి దుస్తులను తొలగించి లేదా, దుస్తుల లోనికి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తిస్తేనే లైంగిక వేధింపులుగా పరిగణించాలని న్యాయమూర్తి పుష్ప గనేదివాల పేర్కొన్నారు.

అయితే ఈ తీర్పుపై అనేకమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై దురాగతాలు అధికమైపోతున్న ఈ తరుణంలో ఇలాంటి తీర్పును హైకోర్టు ఇవ్వడం బాధాకరమని, ఈ తీర్పు దురాగతాలకు మరింత తోడ్పడుతుందని, నిందితులకు మరింత స్వేచ్ఛ ఇచ్చినట్లువుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సినీనటి తాప్సి పన్ను, గాయని చిన్మయి అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పులు విన్న తరువాత తనకు మాటలు కూడా రావడం లేదని తాప్సి ఆవేదన వ్యక్తం చేయగా.. చిన్మయి మరింత ఘాటగా స్పందించారు. జూన్ పాల్ అనే ట్విటర్ యూజర్ చేసిన ఓ ట్వీట్‌‌ను వీరిద్దరూ రీట్వీట్ చేశారు. కాగా చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను.

కానీ ఇలాంటి తీర్పుల గురించి తెలిసిన తరువాత ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు’ అంటూ తాప్సి తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ‘మహిళలు ఎదుర్కొనే చట్టం ఇది. అద్భుతంగా ఉంది కదా.. ఈ దేశం లైంగింక వేధింపులకు పాల్పడే వారికోసమే. వారి కోసం వారే ఏర్పాటు చేసుకున్నది’ అంటూ చిన్మయి ఘాటు వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: