పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు చేస్తూనే మరో పక్క సినిమాలు చేస్తున్నాడు. రాజకీయాల్లో గ్యాప్ వచ్చినప్పుడు సినిమాలు, సినిమాలలో గ్యాప్ వచ్చినప్పుడు రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. రీ ఎంట్రీ తర్వాత ఆయన చేస్తున్న మొదటి సినిమా వకీల్ సాబ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పేరిట ఖుషి సినిమాని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ సినిమా నిర్మిస్తున్నారు.

 ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్ల పాటు జరిగి అనూహ్యంగా వచ్చిన ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న మలయాళం సినిమా రీమేక్ షూటింగ్ మొదలు పెట్టారు. అయితే క్రిష్ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది నిజమేనని తాజాగా అందుతున్న సమాచారం. నిజానికి షూటింగ్ క్యాన్సిల్ కావడానికి ముందే నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ మధ్య కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారని అంటున్నారు.

నిధి అగర్వాల్ నటనకు ఫిదా అయిన పవన్ ఆమెనూ పొగడ్తలలో ముంచెత్తారు అని తెలుస్తోంది. నిజానికి నిధి అగర్వాల్ కి ఇస్మార్ట్ శంకర్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు. అలాంటిది ఆమె అనూహ్యంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా పవన్ దృష్టిలో పడటంతో ఆమె దశ తిరిగినట్టేనని టాలీవుడ్ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ రీమేక్ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యాక మళ్లీ పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: