కొత్త బంగారు లోకం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమాలో శ్వేతా పదహారేళ్ళ తెలుగమ్మాయిలా అలరించింది. ఈ సినిమాలో శ్వేతా చెప్పిన డైలాగులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ సినిమా తరువాత శ్వేతా కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు లభించలేదు. అంతే కాకుండా కెరీర్ మధ్యలోనే శ్వేతా బసు సెక్స్ రాకెట్ లో దొరికిందంటూ ఆరోపణలు రావడంతో కెరీర్ కు భారీగా నష్టం జరిగింది. అయితే ఆ తరవాత శ్వేతా నిర్దోషి అని కోర్టు తేల్చేసింది. ఆ తరవాత బాలీవుడ్ దర్శకుడిని ఫ్యామిలీ లైఫ్ మొదలు పెట్టింది. అది కీడా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లలో నటిస్తూ సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటుంది. ఇదిలా ఉండగా శ్వేతా బసు బాలివుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెకెక్కిస్తున్న "ఇండియా లాక్ డౌన్" సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో లాక్ డౌన్ వల్ల ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నారు అనే అంశం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. కాగా సినిమాలో సెక్స్ వర్కర్లు ఎదురుకున్న ఇబ్బందులను చూపించే పాత్రలో శ్వేతా బసు ప్రసాద్ నటిస్తోంది.

 సెక్స్ వర్కర్ మెహ్రూన్ నిస్సా పాత్రలో శ్వేత కనిపించనుంది. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్వేతా ఈ సినిమాపై ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంటర్వ్యూలో శ్వేతా మత్కడుతూ...నేను చేసే పాత్రలు నిజమని నమ్ముతాను..అప్పుడే ప్రేక్షకులు  సినిమాలో మునిగిపోతారు. నేను చేసే పాత్ర మెరుగ్గా రావడం కోసం దర్శకుడు మధుర్ మరియు టీమ్ తో కలిసి రెండు వారాల క్రితం రెడ్ లైట్ ఏరియా కామాటిపుర కి వెళ్ళాం. అక్కడ వారి జీవన విధానం..యాస ను బట్టి సినిమాలో ఎలా మాట్లాడాలో నేను నేర్చుకున్నా. అంతే కకుబ్ద వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందని తెలుసుకున్నా. లాక్ డౌన్ వ్యాపారాల మీదే కాకుండా వారి జీవితాలపై కూడా గట్టి దెబ్బ కొట్టింది. అక్కడ మెహ్రూనిస్సా ను కలుసుకున్నా సినిమాలో నా పాత్ర అచ్చం అలాగే ఉంటుంది.  కాబట్టి సినిమాలో నా పాత్రను ఆమెకు అంకితం చేస్తున్నా" అంటూ శ్వేతా బసు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: