కుర్ర హీరో రాజ్ తరుణ్ టైం అసలు ఏమీ బాలేదు. లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఈయన ఒక రకంగా చెప్పాలంటే చివరిగా కుమారి 21 ఎఫ్ సినిమాతో హిట్ కొట్టాడు. అప్పటి నుంచి సినిమా హిట్ కొట్టడానికి రాక్షస ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈయన సినిమాలు రిలీజ్ అవ్వడం వెళ్ళి పోవడం జరిగిపోతూ ఉంటుంది. అయితే ఈయన ఒకే దర్శకుడితో ఇప్పుడు మూడో సినిమా చేస్తున్నాడని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు విజయ్ కుమార్ కొండా. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ముందుగా ఒరేయ్ బుజ్జిగా అనే సినిమా వచ్చింది. సత్య సాయి ఫిలిమ్స్ బ్యానర్ మీద రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా కరోనా కారణంగా ఓటీటీ లో రిలీజ్ అయింది. 

సినిమా బాగానే ఉన్నా రోటీన్ సినిమా కావడంతో జనాన్ని మెప్పించ లేక పోయింది. అయితే ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ ఇద్దరూ కలిసి పవర్ ప్లే సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా కూడా దాదాపుగా పూర్తి అయి పోయింది. త్వరలోనే విడుదలకు కూడా రంగం సిద్ధం అవుతోంది. ఇక రాజ్ తరుణ్ హీరోగా డ్రీమ్ గర్ల్ అనే రీమేక్ సబ్జెక్టు సురేష్ బాబు వద్ద ఉందట. చిన్న బడ్జెట్ సినిమా కావడంతో రాజ్ తరుణ్ తోనే తీద్దామని సురేష్ బాబు ముందు నుంచి భావిస్తున్నారట.

అయితే దర్శకుడు దొరకకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఆయన కూడా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో చేసేస్తే పోలా అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం ఒరేయ్ బుజ్జిగా, అలాగే పవర్ ప్లే సినిమాలు రెండూ తక్కువ టైం లో అనుకున్న బడ్జెట్ కంటే తక్కువకే  పూర్తి చేశారు విజయ్ కుమార్. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సురేష్ బాబు ఉ ఈ సినిమా రీమేక్ బాధ్యతను ఆయన చేతిలోనే పెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: