కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక సాదా సీదా హీరోగా కొనసాగుతున్న యశ్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసిన సినిమా కేజీఎఫ్..కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ  ఒకే ఒక్క సినిమాతో 'కేజీఎఫ్‌' స్టార్ ప్యాన్ ఇండియా ఐకాన్ అయిపోయాడు.ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా దాదాపు అన్ని ఇండ్రస్టీల్లో మంచి విజయాన్ని అందుకుంది..ఇక హీరోగా అన్ని ఇండ్రస్టీ లలో యశ్ కి మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.. ఇక ప్రస్తుతం.. 'కేజీఎఫ్ చాప్టర్-2' కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..

 త్వరలో 'కేజీఎఫ్ 2'తో మన ముందుకు రాబోతోన్న రాకింగ్ స్టార్...
 నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు... 'కేజీఎఫ్‌' సినిమాకి ముందు చాలా మందికి యశ్ ఎవరో కూడా తెలియదు. కేవలం కన్నడ మార్కెట్ కే అతను పరిమితం. అయితే, 'కేజీఎఫ్‌' రాకింగ్ స్టార్ సత్తాను బాలీవుడ్ దాకా చాటింది. అందుకే, 'కేజీఎఫ్‌ చాప్టర్ 2'లో సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి బీ-టౌన్ సీనియర్స్ ఉత్సాహంగా నటించారు. 'కేజీఎఫ్ 2' షూటింగ్ ని ఇప్పటికే యశ్ పూర్తి చేసేశాడు. ఆయన తన వంతు బాధ్యత అయిపోవటంతో నెక్ట్స్ మూవీపై దృష్టి పెట్టాడట.ప్రశాంత్ నీల్ తరువాత మరో యంగ్ కన్నడ డైరెక్టర్ కే ఈ సూపర్ స్టార్ ఛాన్స్ ఇచ్చాడని టాక్...

'కేజీఎఫ్‌ చాప్టర్ 2' తరువాత ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేశాడు. 'సలార్' ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరి 'కేజీఎఫ్‌' తరువాత యశ్ పరిస్థితి ఏంటి? ఆయన తమ శాండల్ వుడ్ నుంచే మరో టాలెంటెడ్ డైరెక్టర్ ని ఎంచుకున్నాడని సమాచారం. 'మఫ్టీ' సినిమాతో బెంగళూరు సినీ సర్కిల్స్ లో మంచి బజ్ క్రియేట్ చేశాడు నర్తన్. అతనితోనే యశ్ నెక్ట్స్ చిత్రం ఉంటుందట. ఇప్పటికే డైరెక్టర్ నర్తన్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడని అంటున్నారు. అతి త్వరలో మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: