గత ఏడాది భీష్మ సినిమాతో విజయం సాధించిన టాలీవుడ్ హీరో నితిన్ ఇప్పుడు చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వి. ఆనంద్ నిర్మాణంలో  రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 26వ తేదీన విడుదల కానున్నది. ప్రియా ప్రకాష్ వారియర్ నితిన్ కి లవర్ గా నటించగా.. రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్ర పోషించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సమయం నుంచే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టీజర్, ట్రైలర్ లతో మరింత అంచనాలు పెంచేసింది. కొత్త స్టోరీ తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా విడుదల దగ్గర పడుతుండటం తో ప్రచార కార్యక్రమాల్లో నటీనటులు, దర్శకనిర్మాతలు మునిగితేలుతున్నారు.

ఈ నేపథ్యంలోనే హీరో నితిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "రెండేళ్లుగా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. కానీ ఏ స్క్రిప్ట్ కూడా నాకు నచ్చలేదు. ఆ సమయంలోనే చంద్రశేఖర్ ఏలేటి నా దగ్గరకు వచ్చి 20 నిమిషాల పాటు ఒక స్క్రిప్ట్ వినిపించారు. ఇక మిగతా స్క్రిప్ట్ వినకుండానే నేను సినిమాకి ఓకే చెప్పాను. ఎందుకంటే ఆ కథ నన్ను ఆ స్థాయిలో ఆకట్టుకుంది. డైరెక్టర్ గారు కూడా నాకు సరైన సమయం లో మంచి కథ వినిపించారని నేను సంతోషంగా ఫీల్ అయ్యాను. ఈ సినిమాలో ప్రేక్షకులను కచ్చితంగా ఒక కొత్త నితిన్ ని చూస్తారు. సినిమా కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది అని నమ్ముతున్నాను" అని అన్నారు.

ఇకపోతే సినిమాలో నటించిన ప్రియా ప్రకాష్ వారియర్, హర్షవర్ధన్ తదితర నటీనటులు కూడా సినిమా ప్రమోషన్లలో పాల్గొని చంద్రశేఖర్ తెరకెక్కించిన మనమంతా, అనుకోకుండా ఒక రోజు, ఐతే సినిమాలు తమకు ఎంతో ఇష్టమని.. ఆయన చెక్ స్క్రిప్ట్ వినిపించగానే వెంటనే ఓకే చెప్పామని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: