టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన చెక్ సినిమా ఫిబ్రవరి 27 న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. సినిమాలో నితిన్ సరసన పూజ హెగ్డే, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న నితిన్టీవీ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాంకర్ నితిన్ తో మాట్లాడుతూ..మీరు ఎప్పుడైనా చాలా బాధపడిన, ఇబ్బంది పడిన సందర్భం ఉందా అని ప్రశ్నించగా నితిన్ సమాధానమిస్తూ...ఓ డైరెక్టర్ తనతో సినిమా తిస్తానని చెప్పి రోడ్డు మీద వదిలేసాడని అన్నారు. ఇష్క్ సినిమా కంటే ముందు ఒక కొత్త డైరెక్టర్ తనకు కథ చెప్పాడని..దానికి నితిన్ కూడా ఒకే చెప్పినట్టు తెలిపాడు. అయితే ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టి మరో రెండు నెలల్లో షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉండగా మధ్యలో వదిలేసి వెళ్లాడని..డైరెక్టర్ కు మరో హీరోతో అవకాశం రావడంతో అలా వదిలేసి వెళ్లాడని చెప్పాడు.

అయితే ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యిందని అన్నాడు. ఆ సమయంలో చాలా బాధపడ్డానని నితిన్ అన్నాడు. అయితే ఆ వెంటనే తనకు ఇష్క్ సినిమాలో ఆఫర్ వచ్చిందని అన్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిందని.. ఒక వేళ ఆ డైరెక్టర్ తో సినిమా తీసినా హిట్ అవ్వకపోయేదేమో అని చెప్పాడు. కొన్ని సార్లు అన్నీ మన మంచికే  జరుగుతాయని నితిన్ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉండగా నితిన్ ప్రస్తుతం  రంగ్ దే అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: