భాను శ్రీ ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తోంది. భాను శ్రీ మొదట్లో సినిమాల్లో అవకాశాల కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. అలా తన ప్రస్థానాన్ని కొనసాగించుకుంటూ వచ్చి ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తోంది.. ఇదిలా ఉండగా నెట్టింట్లో ఆమెపై వస్తున్న వార్తలకు స్పందిస్తూ.. భాను శ్రీ తన అభిప్రాయాలను ఇలా పంచుకుంది..

పూర్తి వివరాల్లోకి వెళితే.. భాను శ్రీ మాట్లాడుతూ... " అమ్మ, నాన్నను విడిచి సినిమాల కోసం హైదరాబాద్ వచ్చా.. నాకు షెల్టర్ దొరకకపోతే, ఒక జ్యూస్ సెంటర్ లో తల దాచుకున్నాను. ఆ సమయంలో ఆయన నన్ను ఆదుకున్నాడు. పైగా నాకు ఎంతో సహాయం చేశాడు. కష్టసుఖాల్లో పాలు పంచుకున్నాడు. అలాంటి వ్యక్తితో నేను బ్రేకప్ చేసుకున్నాననే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇవేవీ నిజం కాదు. మేమెప్పుడూ కలకాలం కలిసి ఉంటాము. "  అంటూ చెప్పుకొచ్చింది..

ఇటీవల కాలంలో బిగ్ బాస్ షోలో మెరిసిన భాను శ్రీ,  ఒక వ్యక్తితో ప్రేమలో పడిందని,అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. బ్రేకప్ అయిందని కూడా సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ వార్తలపై భానుశ్రీ క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం విడిపోలేదు,ఎప్పటికీ కలిసే ఉంటాం. తను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అతనే అని అంటోంది. " నేను సినిమాల్లో అవకాశాల కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ కి వచ్చాను. ఆ టైంలో నాకు ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు.

మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కూడా ఎవరూ పరిచయం లేదు. ఆ సమయంలో శంకర్ రెడ్డి నాకు పరిచయం అయ్యాడు. నా కష్టసుఖాలను పంచుకున్నాడు. నా బాధలు అన్నీ తెలుసుకొని నన్ను ఓదార్చి, ఎంతో సపోర్ట్ గా నిలిచాడు. నిజం చెప్పాలంటే అమ్మానాన్న కంటే నాకు అతనే ఎక్కువ. అంతేకాకుండా తల్లి,తండ్రి, భర్త అన్నీ ఆయనే.. "  అంటూ చెప్పుకొచ్చింది భానుశ్రీ.. " ఒకసారి నా చెయ్యి విరిగి బిగ్ బాస్ కి వెళ్లేముందు చావు అంచుల వరకు వెళ్లాను.ఆ టైం ఆయన నాకు దగ్గరుండి అన్ని సేవలు చేశాడు. అతనికి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా, కాదనుకొని నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఆయన సాయంతోనే నా లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంది.త్వరలోనే ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం"  అంటూ భాను శ్రీ  చెప్పుకొచ్చింది..


మరింత సమాచారం తెలుసుకోండి: