మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను దిల్ రాజు దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీగా తెరకెక్కించనున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడగానే అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. దాంతో ఈ సినిమా ప్రారంభం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తుంది. అదేమిటనగా ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను తీసుకున్నారట.

మొదట ఈ మూవీకి మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుథ్ ర‌విచంద్ర‌న్‌ను ఎంపిక చేసిన‌ట్టు గ‌తంలో వార్తలు వినిపించాయి. కానీ చిత్ర యూనిట్ థమన్ వైపే మొగ్గు చూపిందని సమాచారం..అయితే శంకర్ సినిమాలన్నిటికి దాదాపుగా ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తూ వచ్చారు..వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపుగా అన్నీ సినిమాలు కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అయితే రామ్ చరణ్ మాస్ హీరో కావడం..డ్యాన్స్ లలో కూడా ఆగ్రస్థానంలో ఉండడంతో అదిరిపోయే మాస్ బిట్స్ కంపల్సరీ ఉండాల్సిందే.. అయితే ఏ.ఆర్.రెహమాన్ మాస్ బిట్స్ కన్నా మెలోడీస్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు..

దీంతో చరణ్ కోసం శంకర్ మనసు మార్చుకుని థమన్ వైపు చూస్తున్నదని సమాచారం.. మరి దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో మొదలుపెట్టే అవకాశం ఉనట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  అయితే ఇటీవలే శంకర్ కు ‘ఇండియన్‌ 2’ నిర్మాతలు షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. శంకర్‌ తమ సినిమాను పూర్తి చేయకుండానే చరణ్‌తో మరో సినిమాకు రెడీ అయ్యారంటూ లైకా ప్రొడక్షన్‌ కోర్టును ఆశ్రయించింది. అయితే మద్రాసు హైకోర్టు శంకర్ కు ఊరటనిచ్చింది. ఇతర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించకుండా స్టే విధించడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో చరణ్ సినిమా త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: