దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా వుంది. రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఏం చెయ్యాలో తెలీక డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క రికవరీ రేటు పెరుగుతున్న కాని కేసులు మాత్రం తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తున్న కాని చాలా మంది జనాలు సరిగ్గా జాగ్రత్తలు పాటించడం లేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బాధ్యతగా జాగ్రత్తలు పాటించినందుకు సోషల్ మీడియాలో మెచ్చుకుంటున్నారు.వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్‌ జాగ్రత్తలు పాటిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రాజకీయ నాయకులకంటే మీరు వంద రేట్లు మేలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.


తాజాగా రాఖీ సావంత్‌ కూరగాయలు కొనడానికి సమీప మార్కెట్‌కి వెళ్లారు. అసలే కరోనా విజృంభిస్తోంది. పైగా సెలబ్రిటీ బయట కనిపించింది అంటే చాలు.. జనాలు ఎలా గుమిగూడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాఖీ సావంత్‌ ఓ వినూత్న ఆలోచన చేశారు. జనాలు తనను గుర్తు పట్టకుండా ఉండటం కోసమే కాక.. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పీపీఈ కిట్‌ ధరించి మార్కెట్‌ కి వెళ్లడం జరిగింది.చేతులకు గ్లౌవుజులు.. ఒంటి మీద పీపీఈ కిట్‌ ధరించిన రాఖీ సావంత్‌.. ఓ కూరగాయల బండి దగ్గరకు వెళ్లి బేరమాడి.. మంచి ధర చెల్లించి మరి కూరగాయలు కొనుక్కుంది.



ఈ సమయంలో కూరగాయలమ్మే వ్యక్తిని కూడా మాస్క్‌ సరిగా ధరించమని సూచించింది.ఇక రాఖీ సావంత్ అంతా అయిపోయాక ‘‘ఇన్ని కూరగాయలకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనా.. నా జీవితంలో ఇన్ని ఎక్కువ ఐట్సెం ఇంత తక్కువ ధరకు ఎప్పుడు కొనలేదు’’ అంటూ పెద్దగా అరిచి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.బయటకు వెళ్లినప్పడు పీపీఈ కిట్‌ ధరించి వెళ్లడం చాలా మంచిది అంటూ అభిమానులకు సూచించారు.రాఖి సావంత్ చేసిన ఈ మంచి పనికి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: