నందమూరి నాలుగో తరం వారసుడు,బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎన్నో రకాల వార్తలు మీడియా వర్గాల్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ మధ్య స్వయంగా బలయ్యే కొడుకు ఎంట్రీ పై క్లారిటీ ఇస్తూ.. మరికొన్ని రోజుల్లో మోక్షజ్ఞ సినీ ఏంటీ కి ముహూర్తం ఉండబోతోందని.. అంతేకాదు నటనలో శిక్ష కోసం విదేశాలకు పంపినట్లు తెలపడంతో అభిమానులు తెగ ఖుషీ అయ్యారు.కానీ బాలయ్య ఈ విషయాలు చెప్పి చాలాకాలం అవుతున్నా..ఇప్పటివరకు ఓ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు బాలయ్య.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై నందమూరి ఫ్యామిలీలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయట. నందమూరి కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ కి అసలు సినిమాలపై అంతగా ఆసక్తి లేదని.. తనకు వ్యాపార రంగం అంటే ఇష్టమని.. అందుకే తాను వ్యాపార వ్యవహారాలు చూసుకుంటానని తన తల్లి వసుంధరా దేవికి చెప్పాడట. దీంతో ఆమె తల్లి సైతం కొడుకు ఇష్టాన్ని కాదనలేక వ్యాపారాల్లోకే వెళ్ళమని చెప్పినట్లు తెలుస్తోంది.. అయితే మరోవైపు బాలయ్య మాత్రం తన కొడుకుని హీరోగా చూడాలని అనుకుంటున్నాడు.మరి దీనిపై బాలయ్య ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది తెలియాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం బాలయ్య సినిమా విషయానికొస్తే..బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు.మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవు. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: