బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి నాగ చైతన్య సరసన సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్.. ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా.. నిధి అగర్వాల్ తన అందంతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.ఇక ఆ తర్వాత అఖిల్ హీరోగా తెరకెక్కిన  మిస్టర్ మజ్ను' సినిమాలో నటించిన ఈమె..పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్‌'తో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ చూసి అందరు, టాలీవుడ్‌లో నిధికి వరుసగా అవకాశాలు క్యూ కడతాయని భావించారు. కానీ అందరు అనుకున్నంత వేగంగా టాలీవుడ్‌లో అమ్మడి కెరీర్ సాగడం లేదు. ఎప్పుడో అశోక్ గల్లా సరసన ఓ సినిమా కమిటయింది. నత్త నడకన షూటింగ్ సాగుతోంది.

అయితే ఈమెఅనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు'లో నటించే అవకాశం దక్కింది.ఇంతకముందే ఈ విషయాన్ని తెలిపిన నిధి మరోసారి ఇందులో నటిస్తున్నట్టు, ఇది తన లైఫ్‌లో ఎంతో గొప్ప అవకాశం అని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి షూటింగ్‌లో జాయిన్ అవుతానా అనే ఆతృతతో ఉందట. క్రిష్ డైరెక్షన్‌లో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకోగా..క్కరోనాతో విధించిన లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన చిత్రీకరణ తిరిగి త్వరలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ఇక ఈ సినిమాతో పాటూ ఇటీవలే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ జయం రవితో 'భూమి', శింబుతో 'ఈశ్వరన్' సినిమాలు చేసింది. అక్కడ రెండు సినిమాలు ఈమెకి హీరోయిన్ గా మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: