బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల్లో షారుఖ్ ఖాన్ ఒకరు. ఈయన సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే షారుక్ నటించే సినిమాలు మొదటి వీకెండ్ లోనే వందల కోట్ల వసూళ్లను అందుకుంటూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ హీరోకి సరైన హిట్ లేదు. దీంతో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని 'పఠాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు షారుక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటె షారుక్ ఖాన్ అతి త్వరలో తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్న  సంగతి తెలిసిందే.

ఇటీవలే అట్లీ చెప్పిన కథకు షారుక్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో నటీ, నటుల ఎంపికపై దర్శకుడు అట్లీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాలో షారుక్ కి జోడిగా తమిళ స్టార్ హీరోయిన్ నయనతార నటించనున్నట్లు తాజా సమాచారం.ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో రాజా రాణి, బిగిల్ సినిమాల్లో నటించింది నయన్.ఇక ఇప్పుడు షారుక్ సినిమాతో హిందీ పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇవ్వనుందట.అయితే సౌత్ లో చాలాకాలం పాటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయన తార..

ఇప్పటివరకు హిందీ సినిమా చేయలేదు.ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ సినిమాతో హిందీలో కూడా తన సత్తా చాటబోతోంది ఈ సౌత్ హీరోయిన్. అసలైతే గతంలో షారుక్ ఖాన్, దీపికా పదుకునే హీరో హీరోయిన్లుగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా కోసం నయనతారను సంప్రదించారట.అయితే అది హీరోయిన్ పాత్ర కోసం కాదని.. సినిమాలో ఐటెం సాంగ్ కోసమని.. అందుకే షారుక్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం ఇష్టం లేక అప్పుడు నో చెప్పిందట నయన్.కానీ ఇప్పుడు మాత్రం  షారుక్ సరసన హీరోయిన్ గా నటించడానికి సిద్ధం అయ్యింది.ఇక త్వరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ ఉండనుందట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: