అయితే బాహుబలి సినిమాకు ముందు రైటర్ గా సాయి మాధవ్ ను అనుకున్నారు కాని ఆయన ఈ సినిమా ఒక పార్ట్ గా అయితేనే మాటలు రాస్తానని అన్నారట. అనుకోకుండా బాహుబలి రెండు పార్టులు అవడం సాయి మాధవ్ బుర్ర ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు పోవడం రెండు జరిగాయి. సాయి మాధవ్ బుర్ర తెలుగులో ఉన్న టాప్ రైటర్స్ లో ఒకరుగా కొనసాగుతున్నారు. బాహుబలి ఛాన్స్ మిస్ చేసుకున్నా ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు సాయి మాధవ్ బుర్ర. అయితే ఆర్.ఆర్.ఆర్ లో డైలాగ్స్ అదిరిపోతాయని అంటున్నారు ఈ మాటల రచయిత.
సినిమాలో యాక్షన్ పార్ట్ తో పాటుగా డైలాగ్స్ కూడా దద్దరిల్లిపోతాయని. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ పాత్రకు డైలాగ్స్ బాగా వచ్చాయని అని చెప్పారు సాయి మాధవ్ బుర్ర. ఆర్.ఆర్.ఆర్ సినిమా మాటలకు తనకు మంచి పేరు వస్తుందని భావిస్తున్నారు సాయి మాధవ్ బుర్ర. ట్రిపుల్ ఆర్ తో పాటుగా శంకర్, రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమాకు మాటలు రాసే ఛాన్స్ అందుకున్నారు సాయి మాధవ్. తెలుగులో భారీ సినిమాలన్ని ఆయనే మాటలు రాస్తుండటం విశేషం.