ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే మూవీ తెరకెక్కించడం జరుగుతుంది.పుష్ప సినిమాను రెండు భాగాలుగా సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.బన్నీ, సుకుమార్ కాంబినేషనులో వస్తున్న మూడో సినిమా ఇది.సుకుమార్ తన మొదటి సినిమా చేసింది కూడా బన్నీతోనే. వీరిద్దరి కాంబినేషనులో వచ్చిన మొదటి సినిమా ఆర్య. ఆర్య సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో దిల్ రాజు నిర్మించడం జరిగింది. ఆర్య సినిమా ఫీల్ గుడ్ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ. ఆర్య సినిమా అప్పట్లో యూత్ కి బాగా నచ్చేసింది. ఆర్య సినిమాతో ఒకేసారి బన్నీకి, సుకుమార్ కు బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెట్టింది. దిల్ రాజుకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఆర్య  సినిమాతో  సుకుమార్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. బన్నీ, సుకుమార్ కాంబినేషనులో వచ్చిన రెండో సినిమా ఆర్య సినిమాకి సీక్వల్ గా ఆర్య-2 తెరకెక్కింది.ఆర్య -2లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. హీరో నవదీప్ ముఖ్య పాత్ర పోషించాడు. ఆర్య సినిమా అంతగా ఆర్య-2 లేకపోవడంతో ఈ  సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆర్య, ఆర్య-2 రెండు సినిమాలకు  దేవిశ్రీ ప్రసాద్ మంచి  మ్యూజిక్ అందించాడు. సుకుమార్, దేవిశ్రీ కాంబోలో చాలా మంచి సాంగ్స్ వచ్చాయి. సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ కు అద్భుతంగా దేవిశ్రీ బాణీలను అందిస్తాడు.

ఆర్య, ఆర్య-2లో కూడా ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషనులో పుష్ప సినిమా రానుంది.ఈ సినిమాను కథ  ప్రకారం ఒకే భాగంలో చెప్పడం కుదరక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆ్లుఅర్జున్ పాత్ర  పక్కా మాస్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా నుంచి అల్లుఅర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ అయిన టీజర్ కు భారీ స్పందన  వచ్చింది. పుష్ప మొదటి భాగాన్ని ఆగస్టు 13న రిలీజ్ చేయాలనుకున్న కరోనా కారణంగా షూటింగ్ వాయిదాపడింది. పుష్ప సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది. ఇది ఇలా ఉండగా పుష్ప రెండవ భాగంలో కథ ప్రకారం మరొక హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. బన్నీ, పూజా హెగ్డే కాంబినేషనులో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.వీరిద్దరి కాంబినేషనులో  వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. వీరు మరోసారి జత కట్టబోతున్నారు. పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డ్స్ బద్ధలుకొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: