మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తన సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. అంతేకాదు హడావిడి సినిమా చేసేయడం ఆయన వల్ల కానే కాదు. ఒకసారి షాట్ ఓకే అనుకుంటే దాన్ని మళ్లీ తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా మొదట తారక్ తో అనుకున్నా అది కాస్త పెండింగ్ పడటంతో ఆ సినిమా ప్లేస్ లో మహేష్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. మహేష్ సర్కారు వారి పాట పూర్తి కాగానే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

త్రివిక్రం మహేష్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమా వస్తుంది. అతడు ఖలేజా సినిమాల తర్వాత ఈ ఇద్దరి కలిసి చేస్తున్న మూడవ సినిమాపై ఆడియెన్స్ లో కూడా ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమాకు మహేష్ త్రివిక్రం కు కేవలం మూడంటే మూడు నెలలు మాత్రమే టార్గెట్ పెట్టాడని తెలుస్తుంది. సర్కారు వారి పాట ఫినిష్ చేసి వెంటనే త్రివిక్రం మూవీ చేయాలని చూస్తున్న మహేష్ ఆ సినిమాను త్వరగా పూర్తి చేసి మరో సినిమా చేయాలని చూస్తున్నాడు. రాజమౌళితో సినిమా ప్లానింగ్ లో ఉన్న మహేష్ ఆ సినిమాకు ముందు మరో రెండు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.

అందుకే త్రివిక్రం మూవీ త్వరగా పూర్తి చేసి అనీల్ రావిపుడి డైరక్షన్ లో కూడా ఒక సినిమా త్వరగా చేయాలని అనుకుంటున్నాడట. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి ఎలా లేదన్నా ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటాడు. ఆ గ్యాప్ లో రెండు సినిమాలు సగానికి పైగా పూర్తి చేసి జక్కన్న సినిమా సెట్స్ మీదకు వచ్చే టైం కు ఆ సినిమాలు పూర్తి చేయాలనే ప్లాన్ వేశాడు మహేష్. మరి సూపర్ స్టార్ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: