ఒక సినిమా హిట్ కావాలంటే డైరెక్షన్, హీరో మరియు హీరోయిన్ల ప్రతిభతో పాటు డైలాగ్స్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మరీ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలయితే డైలాగ్ లకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. సినిమా చరిత్రలో ఎంతోమంది గొప్ప రచయితలు మంచి మంచి డైలాగులను రాసి సినిమా విజయాలలో తమ వంతు పాత్ర పోషించారు. అయితే తాజా ట్రెండ్ ని బట్టి చూస్తే టాలీవుడ్ లో ఒకరి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతనెవరో కాదు ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా. తన డైలాగులతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగల ప్రతి ఆయన సొంతం. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న మరియు త్వరలో షూటింగ్ జరుపుకోనున్న చిత్రాలకు ఇతనే డైలాగులను అందిస్తున్నాడు.

వాటిలో చూసుకుంటే టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు madhav BURRA' target='_blank' title='సాయి మాధవ్ బుర్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సాయి మాధవ్ బుర్రా మాటలను అందిస్తున్నాడు. ఇప్పటికే రాజమౌళితో పని చేసిన అనుభవం ఉండడంతో, ఏ విధముగా తనకు మాటలు రాయాలో జక్కన్నకు తెలుసని సాయి మాధవ్ ఒక ఇంటర్వ్యూలో తెలియచేశారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అద్భుతమైన మాటలను రాశానని చెప్పారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పలికే డైలాగులు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయని అనుకుంటున్నారు. ఇక మోస్ట్ వాంటెడ్ కాంబోగా తెరకెక్కుతున్న శంకర్ - రామ్ చరణ్సినిమా ఇప్పటికే ఎన్నో అంచనాలను ప్రేక్షకుల్లో కలిగించారు. ఈ సినిమాకు కూడా సాయి మాధవ్ మాటలను అందిస్తున్నాడు.

సాయి మాధవ్ చెప్పిన ప్రకారం శంకర్ ని కలవడమే ఒక జీవితాశయంగా పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు అతనితోనే సినిమా చేస్తున్నాడంటే ఇంక అతని ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఇది కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాకు కూడా సాయి మాదవ్ బుర్రానే మాటలను అందిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా డైలాగులకు పెద్ద పీట వేసినట్లుగా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: