తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనీష్, ముస్కాన్ జంటగా నటించిన "మరో ప్రస్థానం" ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని, హీరో పాత్ర విభిన్నంగా, వినూత్నంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. క్రిమినల్ జర్నీ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో ప్రతి ప్రేమ్ లో దర్శకుడి పని తీరు, నటీనటుల, సాంకేతిక వర్గం నైపుణ్యం, కష్టం కనిపిస్తాయని నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో అర్చన సింగ్, టార్జాన్ గగన్, విహార్, అజిత్, కేరాఫ్ కంచరపాలెం రాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
జానీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, వరుడు ఫ్రేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ వారు నిర్మించారు. కిరణ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఈ మధ్యనే పుట్టినరోజు జరుపుకున్న తనిష్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు కూడా తీసుకున్నారు ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి చిరంజీవి ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలుస్తోంది. సో ఈ సినిమాతో మళ్ళీ తనీష్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వేళతాడేమో చూడాలి.