టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్ జయసుధ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె తన నటనతో, మాట్లాడే మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేది. అయితే ఇప్పుడు ఈ ఫోటోలో జయసుధను చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఏంటి జయసుధ ఇలా అయ్యింది.. ఇప్పుడు అని అనుకుంటున్నారు. అయితే ఆమె అలా అవ్వడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


వాస్తవానికి జయసుధ ఇప్పుడు ఇండియాలో లేదు.. అమెరికాలో ఉన్నట్లు సమాచారం.. అక్కడ  అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చిన్నపిల్లలకు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఒకప్పుడు బాగా బిజీగా ఉండి ఈమె కొన్ని నెలలుగా ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇక తన భర్త మరణించిన అనంతరం ఆమెకు సినిమాలపై ఉన్న ఆసక్తి తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యనే ఈమె కొడుకు గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే మూవీ లో విలన్ గా నటిస్తున్నాడు.


ఇక ఈమె అమెరికాలోనే ఉంది ప్రస్తుతం. అయితే ఈమె ఇలా మారిపోవడం చూసి షాక్ కు గురయ్యారు ఆమె అభిమానులు. ఇక ఈమె ఫ్యామిలీ మూవీస్ లలోనే కాకుండా ఒకానొక సమయంలో బికినీ కూడా వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఒక స్టార్ హీరో ఇచ్చిన సలహా మేరకు ఆమె పూర్తిగా.. సాంప్రదాయబద్ధమైన నటనలోనే నటిస్తోంది. అందుచేతనే ఈమె సహజనటి అని కూడా బిరుదు పొందింది.

ఇక మరికొంతమంది తెలిపిన వివరాల మేరకు జయసుధ  అనారోగ్యం కారణంగానే ఇలా మారిపోయింది అంటూ తెలియజేస్తున్నారు. లేదంటే వయసు పెరుగుతున్నది కాబట్టి ఆమె ఇలా అయిపోయారు అని మరి కొంతమంది ఈ ఫోటోని చూసి కామెంట్లు చేస్తున్నారు. ఇక జయసుధ సన్నిహితులు తెలిపిన ప్రకారం ఆమెకు ఏం కాలేదు ..కొద్ది రోజుల నుంచి అలానే ఉంటుంది అన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఏదిఏమైనా అప్పుడు చూసిన జయసుధను ఇప్పుడు ఇలా చూడడం చాలా కష్టంగానే ఆనిపిస్తోంది చెప్పవచ్చు. కాకపోతే ఒక వేళ తను అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే  త్వరగా కోలుకోవాలి అని ప్రేక్షకులు  ఆకాంక్షిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: