మెగా హీరో సాయి ధరమ్ నటించిన తాజా చిత్రం 'రిపబ్లిక్' అక్టోబర్ 1 న (ఈ రోజు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రాజకీయ, సామాజిక అంశాల నేపథ్యంలో రూపొందింది ఈ సినిమా. ఇక ఈ సినిమాను తేజు కోరిక మేరకు అక్టోబర్ 1న విడుదల చేసారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు రోజు రాత్రే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షో ను వేశారు.ఇక సినిమా చూసిన వాళ్లంతా కూడా సాయి ధరమ్ తేజ్ నటనతో పాటు,ఈ సినిమా కథను తెరకెక్కించడంలో దర్శకుడు దేవా కట్టా చూపించిన నిజాయితీని మెచ్చుకుంటున్నారు.ఇక ఇటీవలే కోమా నుండి బయటికి వచ్చిన సాయి తేజ్..ఈ సినిమా విజయాన్ని మనసారా ఆస్వాదించాలని అందరూ కోరుతూ..

సోషల్ మీడియా వేదికగా ఈ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా సమాజానికి అవసరమైన ఇక బలమైన కథను ఎంచుకొని 'రిపబ్లిక్' సినిమా తీసాడు.నిజానికి ఇలాంటి కథల్లో నటించడానికి మన యంగ్ హీరోలు భయపడతారు..కానీ మన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం రిస్క్ చేసాడనే చెప్పాలి.దేవా కట్టా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అయిన 'ప్రస్థానం' సినిమాకి అప్పట్లో విమర్శలకుల ప్రశంసలు లభించాయి తప్పా..ఆశించిన వసూళ్లు మాత్రం రాలేదు.కేవలం ఒక గొప్ప సినిమా అనే పేరు మాత్రమే మిగిలింది.ఇక మళ్ళీ అదే సామాజిక, రాజకీయ నేపథ్యంతో 'రిపబ్లిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ దర్శకుడు. 

అయితే ఇప్పటివరకు వేసిన స్పెషల్ షో లో సినిమాకి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది.ముఖ్యంగా సినిమాలో తేజు నటన, అతను పలికిన డైలాగ్స్, రమ్యకృష్ణ పాత్ర ఇవన్నీబ్సినిమాలో ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అంటున్నారు.ఇక ముఖ్యంగా ఈ సినిమాతో తేజు నటనలో మరో మెట్టు పైకి ఎక్కాడనే టాక్ వస్తోంది.దీంతో తేజు చేసిన రిస్క్ ఫలించిందనిఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. అయితే అన్నీ బాగానే ఉన్నా ఈ సినిమా కలెక్షన్స్ ఈ విధంగా ఉండబోతున్నాయనేదే హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటివరకు సినిమాకి మంచి టాక్ వచ్చినట్లే.. వసూళ్లు కూడా అదే రేంజ్ లో వస్తాయేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: