చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణపై గత కొద్దీ రోజుల నుండి ఓ వార్త వైరల్ ఆవుతుంది. అయితే బాలయ్య ఆ వార్తను తాజాగా నిజం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షో చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ షో కోసం ఆయన ఎదురుచూస్తున్నామని అభిమానులు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆ షో ఎప్పుడు ఏంటీ అనే విషయమై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇక అదే సమయంలో నందమూరి బాలకృష్ణ సన్నిహితులు ఆసక్తికర విషయాన్ని తెలిపారు. అదేంటంటే.. ఆహా ఓటీటీ కోసం బాలకృష్ణ టాక్ షో విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని.. కాని చర్చలు జరుగుతున్న మాట వాస్తవం అనే విధంగా స్పదించారు . అయితే ఆహా లో టాక్ షో అనేది నిజం అయ్యి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తపై నెట్టింట జరుగుతున్న చర్చ అనేది నిజం అని తెలిసిపోయింది.

అంతేకాదు.. బాలకృష్ణ, క్రిష్ లు ఈ టాక్ షోను చేయబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి గతంలో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చేశారు. అదే విజయాన్ని ఈ షో దక్కించుకుంటుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో అఖండ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాను దీపావళికి విడుదల చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే షూటింగ్‌ ను ఇటీవలే ముగించిన చిత్ర యూనిట్‌ సభ్యులు త్వరలోనే విడుదల విషయమై క్లారిటీ ఇస్తారనే టాక్ వినపడుతుంది. ఇక బాలయ్య ఆహాలో కూడా కనిపించడం వల్ల ఖచ్చితంగా ఆయన స్థాయి మరింత పెరగడంతో పాటు ఒక టాప్ స్టార్ హీరో టాక్ షోను చేసిన రికార్డు ఆయనకు దక్కతుందని ఇండస్ట్రీలో ప్రముఖులు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. టాక్ షోపై బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: