మా మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎవరికి నచ్చిన వారికి సినీ ఇండస్ట్రీ లో ఉండే నటీనటులు సపోర్ట్ చేశారు. ఇక అటువంటి సమయంలోనే మరోక విషయం హాట్ టాపిక్ గా నిలిచింది. హీరోయిన్ పూనమ్ కౌర్ పై గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్లో వినిపిస్తున్నటువంటి కొన్ని పుకార్ల పై ఆమె స్పందిసస్తు.. సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి ఒక స్టార్ తనని అని మోసం చేశాడని అంటుంటారు.

అదే విషయాన్ని పోసాని కృష్ణ మురళి కూడా తెలియజేశారు. అయితే ఆయన ఎవరో మాత్రం చెప్పలేదు పూనమ్ కౌర్. కానీ దీంతో మళ్లీ మొదటికి వచ్చింది ఈ విషయం. ఇటువంటి సమయంలోనే హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందిస్తూ.. తన మద్దతు ప్రకాష్ రాజ్ కే అన్నట్లుగా తెలియజేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని కూడా మరొకసారి తీసుకువస్తూ.. ఆమెకు చేసిన అన్యాయం నికీ గల ముఖ్య కారకుడ తెలియాలంటే మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ను గెలిపిస్తే తెలియజేస్తాం అని తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.


ప్రకాష్ రాజ్ గెలవడంతో తన కష్టం తీరుతుందని భావించిన పూనమ్ కౌర్ ఆమె ఆశించిన స్థాయిలో ప్రకాష్ రాజ్ కు  ఫలితం దక్కలేదు. మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ గెలిచి ఉంటే.. పూనమ్ కౌర్ అసలు విషయాన్ని బయట పెట్టేది అన్నట్లుగా చాలామంది తెలియజేస్తున్నారు. ఇక పూనమ్ కౌర్ కూడా ఇదే అనుకుంటుంది అన్నట్లుగా కొంతమంది చెప్పుకొస్తున్నారు.కాని వీరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మంచు విష్ణు మా అధ్యక్షుడయ్యారు.

ఇక మళ్లీ దీంతో పూనమ్ కార్ విషయం మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లి పోయినట్లే.. అని టాలీవుడ్ లో ఉండే కొందరు అనుకుంటున్నారు. అయితే పూనమ్ కౌర్ ఇప్పుడు ఎలా ఆలోచిస్తుంది అనే విషయంపై ఆమె అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈ విషయం ఎప్పటికైనా తానే స్వయంగా తెలియజేస్తుందెమో వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: