తెలుగు ఓటీటీల్లో 'ఆహా' సంస్థ 2.0 అంటూ ఒక కొత్త వెర్షన్ ని స్టార్ట్ చేశారు. ఇటీవల దీనికోసం హైదరాబాదులో ఒక ఈవెంట్ ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఓటీటీ లో లో రిలీజ్ అయిన సినిమా లకు అవార్డులు అందించారు. కలర్ ఫోటో సినిమా హీరో అయినా సుహాస్ బెస్ట్ యాంకర్ అవార్డు గా అవార్డు పొందారు. కలర్ ఫోటో సినిమా కే బెస్ట్ నటి అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డు సినిమా హీరోయిన్ అయినా చాందిని చౌదరి సొంతం చేసుకుంది. ఆహా ఓనర్స్ లో ఒకరైన అల్లు అరవింద్ మాట్లాడుతూ ఒక వైపు బాలకృష్ణ ఆపరేషన్ గురించి వివరించారు. హీరో బాలయ్య పై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.

ఒక టాక్ షో చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు హోస్ట్ గా ఎవరిని తీసుకోవాలి అని సతమతమవుతున్న గా ఆయన బాలయ్య పేరు సూచించారట. మరి దానికి ఆయన ఒప్పుకుంటారో లేదో అన్న అనుమానం అయితే కలుగుతుంది. వెంటనే బాలయ్య కి ఫోన్ చేసి ఇ మీరు ఆహా చూస్తూ ఉంటారా అని అడిగితే దానికి బాలయ్య చూస్తుంటాను అని సమాధానం ఇచ్చారట. సమంత షో తర్వాత అలాంటి షో మీతో ఒకటి చేయాలి అనుకుంటున్నా మని అల్లు అరవింద్ చెప్పగా వెంటనే తమ టీం ని పంపమని చెప్పారట బాలయ్య. బాలయ్య దగ్గరకు వెళ్లిన టీం కాన్సెప్ట్ చెప్పగానే బాగుందని మెచ్చుకున్నారట.

 బాలయ్య తనకు ఏదైనా నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని స్ట్రెయిట్ గా చెప్పేస్తానని అల్లు అరవింద్ తెలిపారు. బాలయ్య టపాస్ లాంటోడు అని కూడా చెప్పారు. ఇక ఈ షో కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.ఇక నవంబర్ 4న దీపావళి సందర్భంగా  'అన్ స్టాపబుల్' మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుంది. మంచు మోహన్, బాబు మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న మొదటి ఎపిసోడ్ లో సందడి చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఆ తర్వాత రెండవ ఎపిసోడ్ కి నాని, మూడవ ఎపిసోడ్ కి దగ్గుబాటి రానా హాజరు కానున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: