సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ఇకపై సినిమాలకు దూరం కానున్నారని గతంలో ఎన్నోసార్లు వార్తలు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కొత్త సినిమా రిలీజ్ అయితే ప్రతిసారి ఈ వార్త కూడా వైరల్ అవుతూ ఉంటుంది. కానీ రజనీకాంత్ మాత్రం తన కొత్త సినిమాను విడుదల చేసి.. వెంటనే మరో కొత్త ప్రాజెక్ట్ ని కూడా ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా దీపావళి సందర్భంగా రజనీకాంత్ నటించిన 'పెద్దన్న' సినిమా విడుదలైంది.

 ఇప్పుడు ఈ సారి కూడా ఈ సినిమా రజినీకాంత్ గారి ఆఖరి సినిమా అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి ఈ వార్త నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అందుకు తగిన కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..' రజినీకాంత్ గారికి ఇప్పుడు 70 ఏళ్లు. దానికి తోడు ఈ మధ్య కాలంలో ఆయన తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. షూటింగ్ లో కన్నా ఎక్కువగా హాస్పిటల్స్ లోనే జాయిన్ అవుతున్నారు. తాజాగా విడుదలైన పెద్దన్న సినిమా షూటింగ్ ఈ సమయంలో కూడా ఆయన అనారోగ్యంతో చాలా సార్లు ఇబ్బంది పడ్డారు. దీంతో కుటుంబం నుంచి ఆయనకు తీవ్ర ఒత్తిడి వస్తుందని టాక్ వినిపిస్తోంది.

 ఆరోగ్యం దృష్ట్యా ఇప్పుడు సినిమాలకు విరామం ఇవ్వడం మంచిదని ఆయన ఇంట్లో వాళ్ళు అంటున్నారట. దీంతో రజినీకాంత్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దన్న సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుని ఆ మధ్యనే అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలు ఎక్కడం కష్టమే అని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. అయితే రజనీకాంత్ ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆయన అభిమానులు ఈ విషయంలో కాస్త నిరాశకు లోనవుతున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: