మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'జంజీర్' మూవీ తర్వాత బాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయలేదు గానీ.. బాలీవుడ్‌తో స్నేహ బంధం కొనసాగిస్తున్నాడు.  తెలుగులో మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్‌తో ఫ్రెండ్‌షిప్‌ మెయింటైన్ చేస్తున్నట్లే హిందీలో సల్మాన్ ఖాన్, రణ్‌వీర్‌ సింగ్‌ లాంటి వాళ్లతోనూ దోస్తీ ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ మూవీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌తో హిందీలో కూడా స్టార్డమ్‌ పెంచుకోవాలనుకుంటున్నాడు చెర్రీ. అందుకే ఈ మూవీ లాంచింగ్‌కి బాలీవుడ్‌ నుంచి రణ్‌వీర్‌ సింగ్‌ని పిలిపించారు.

రణ్‌వీర్ నెక్ట్స్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు కాబట్టి, ఈ లింక్‌తో మెగామూవీ లాంచింగ్‌కి చీఫ్‌ గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు. రామ్ చరణ్‌, రణ్‌వీర్‌ సింగ్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ స్నేహంతోనే ఒక యాడ్‌షూట్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన రణ్‌వీర్‌కి బిర్యాని ట్రీట్‌ ఇచ్చాడు చరణ్. ఇక మెగాపవర్‌ స్టార్‌ ఇంటి నుంచి వెళ్లిన హైదరాబాద్‌ బిర్యానికి రణ్‌వీర్‌ సింగ్‌ ఫిదా అయ్యాడనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

సల్మాన్ ఖాన్‌కి చిరంజీవి ఫ్యామిలీకి ఎప్పటినుంచో రిలేషన్‌ ఉంది. ఈ ఫ్రెండ్‌షిప్‌తోనే రామ్‌ చరణ్‌ హిందీ డెబ్యూ 'జంజీర్‌' సమయంలో సల్మాన్ సాయం చేశాడు. అలాగే సల్మాన్ ఖాన్‌ 'ప్రేమ్‌ రతన్ ధన్‌పాయో' తెలుగులో డబ్ అయినప్పుడు సల్మాన్‌కి వాయిస్‌ ఇచ్చాడు రామ్ చరణ్. అంతేకాదు సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా రామ్‌ చరణ్‌ స్పెషల్‌ హైదరాబాదీ బిర్యాని పంపిస్తుంటాడు. ఇప్పుడు చిరంజీవి 'గాడ్‌ఫాదర్'లో సల్మాన్ ఖాన్‌ స్పెషల్‌ రోల్‌ చేస్తాడనే టాక్ కూడా ఉంది.


మొత్తానికి రామ్ చరణ్ చూపించిన బిర్యానీ రుచికి బాలీవుడ్ మైమరిచిపోతోంది. ఆ రుచులనే తలచుకుంటూ గడిపేస్తోంది. ఆహా.. ఏం టేస్ట్ చూపించావ్ అంటూ ఆ హీరోను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఆ నటులు. ఆ రుచికోసం మళ్లీమళ్లీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: