టాలీవుడ్ మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రిపబ్లిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విభిన్న కథా చిత్రాల దర్శకుడు దేవకట్టా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక సాయి తేజ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో కనిపించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంశలు మాత్రం అందుకుంది. అయితే ఇదిలాఉంటే సాయి తేజ్ తన తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నారు అనే అంశం ఫాన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది.

ఇక తాజా సమాచారం ప్రకారం సంపత్ నంది దర్శకత్వంలో తేజు తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు. ఇక ఈ మధ్య సంపత్ నంది దర్శకత్వం వహించిన 'సీటీమార్' సినిమా విడుదలై అదికూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు సంపత్ నంది. ప్రస్తుతం ఈ ఇద్దరికీ ఓ సరైన హిట్ కావాలి దీంతో. వీరిద్దరూ మంచి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే సంపత్ నంది సాయి ధరంతేజ్ కోసం ఒక మంచి స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు సమాచారం. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టుని నిర్మించబోతుండటం విశేషం.

ఇక ఈ మైత్రి నిర్మాతలు గతంలో సాయిధరమ్ తేజ్ తో 'చిత్రలహరి' సినిమాను నిర్మించారు.కానీ ఆ సినిమా కమర్షియల్ గా అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు ఉప్పెన సినిమా తో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్  ను హీరోగా లాంచ్ చేసి భారీ సక్సెస్ను అందుకుంది మైత్రి మూవీ మేకర్స్. ఇక ఈ సారి సాయిధరమ్ తేజ్తో మంచి విజయాన్ని అందుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు.ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా సాయి ధరమ్ తేజ్ కి విజయం దక్కుతుందేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: