టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య తను చేసే ప్రతి సినిమాలోనూ అలా యాక్టివ్ గా ముందుకు వెళుతూ ఉంటాడు. కానీ ఈ హీరో కి కాలం ఏ మాత్రం కలిసి రావడం లేదు. తను చాలా సినిమాలలో నటించడం జరిగింది కానీ దాదాపుగా చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తను ఏదో చేసేయాలి అంటూ చేసిన ప్రతి సినిమా అక్కడే ఆగిపోతుంది. అయితే నాగ శౌర్య ఈ ఏడాది తాజాగా రెండు సినిమాలు చేయడం జరిగింది. మొదటి సినిమా వరుడు కావలెను' .. ఇక రెండవది 'లక్ష్య'.. ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అవడం ఎంతో బాధాకరం. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెండు సినిమాలు చేస్తున్నాడు...అవి 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' .. ' మరియు పోలీస్ వారి హెచ్చరిక'.

ఇక తను చేసిన ఈ రెండు సినిమాలు ఏమవుతాయో చూడాలి. ఈ రెండు సినిమాలపై నాగశౌర్య ఏదో ఒకటైన హిట్ అయితే మళ్ళీ లైన్ లోకి వచ్చే నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ రెండు సినిమాలలో ఒకటైన మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాల్సిందే. అయితే తాజాగా నాగశౌర్య ఈ రెండు సినిమాలతోనే కాకుండా మరో రెండు ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టాడట. ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టడమే కాకుండా ఇంకో సినిమాకి కూడా నాగ శౌర్య ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని రాజ్ - డీకే నిర్మించనున్నట్లు గా తెలుస్తోంది. అయితే  ఈసారీ స్టార్ డైరెక్టర్లు ఈ సినిమాను నిర్మించడం తో నాగశౌర్య నమ్మకానికి హద్దులు లేకుండా పోయాయి.

వీరు స్టార్ డైరెక్టర్లు కావడంతో ఏమాత్రం ఆలోచించకుండా నాగ శౌర్య ఈ ప్రాజెక్టును ఓకే చేసాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాజ్ నిడిమోరు - డీకే కృష్ణ ఇద్దరూ మంచి గుర్తింపును పొందిన డైరెక్టర్లు. ఇద్దరు డైరెక్టర్లు కలిసి తీసిన ఫ్యామిలీ మేనే అనే వెబ్ సిరీస్ వీరికి ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే వీరు తీసిన వెబ్ సిరీస్ కి దేశవ్యాప్తంగా కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇక తాజాగా ఈ ఇద్దరూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలని ప్లాన్ లో ఉన్నారట. ఇక ఈ ఇద్దరూ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా  సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇంతకుముందు వీరిద్దరూ కలిసి చేసిన బండి డైరెక్టర్ తో కలిసి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు గా తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించిన పనులను కూడా వీరు ప్రారంభించినట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: