సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్  సినిమా తర్వాత గీత గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది, ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి, అప్పట్లో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది, అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను జనవరి 13 వ తేదీన కాకుండా ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.

 ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోల సినిమాలు చాలా వరకు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్నాయి, అందు వలన మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే ఆలోచనలో మిత్ర బంధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, అలా వారి ఆలోచనను మహేష్ బాబుకు  తెలియజేయగా మహేష్ బాబు దానికి అంగీకరించినట్లు తెలుస్తోంది, కానీ సర్కారు వారి పాట సినిమా నిర్మాతలు ప్రయత్న మహేష్ బాబును ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి నిర్మాతలు, మహేష్ బాబు ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: