సూపర్ స్టార్ మహేష్ తో స్టార్ డైరక్టర్ క్రిష్ డైరక్షన్ లో ఓ సినిమా అని అప్పట్లో హడావిడి చేశారు. సినిమా పేరు శివమ్ అని కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని.. మహేష్ ఫ్యాన్స్ కు సినిమా సూపర్ ట్రీట్ ఇస్తుందని హంగామా చేశారు. ఈ సినిమా గురించి రాజమౌళి కూడా శివమ్ కథ తనకు తెలుసని.. అద్భుతంగా ఉంటుందని రాజమౌళి అప్పట్లో చెప్పాడు.

మరి ఏమైందో ఏమో కానీ ఆ సినిమా ఆగిపోయింది. క్రిష్ చెప్పిన కథకు మహేష్ ముందు ఓకే చెప్పినా ఫైనల్ స్క్రిప్ట్ విషయంలో మహేష్ కన్విన్స్ చేయడంలో క్రిష్ సక్సెస్ అవలేదట. అందుకే ఆ కథను పక్కన పెట్టి రానాతో సినిమా చేశాడు క్రిష్. మహేష్ తో చేయాల్సిన సినిమా అప్పుడు ఆగిపోగా ఆ కాంబో ఇప్పటికీ కుదరలేదు. క్రిష్ ఆ కథను చేస్తే మహేష్ తోనే చేయాలని ఇప్పటికీ అలానే ఉంచాడని తెలుస్తుంది.

కథానాయకుడు, మహానాయకుడు, కొండపొలం సినిమాలతో నిరాశపరచిన క్రిష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చారిత్రక కథాంశంతో వస్తుందని తెలుస్తుంది. క్రిష్ మహేష్ కాంబో సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఫ్యూచర్ లో అయినా ఈ కాంబో రిపీట్ అవుతుందేమో చూడాలి.  ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం తో సినిమా లైన్ లో పెట్టగా ఆ నెక్స్ట్ జక్కన్నతో సినిమా చేయాల్సి ఉంది. క్రిష్ కరెక్ట్ కథతో వస్తే మహేష్ ఇప్పటికైనా అతనితో సినిమా చేయాలని చూస్తున్నట్టు టాక్. మహేష్ ఛాన్స్ ఇస్తే శివం కథతోనే మళ్లీ వస్తాడా లేక కొత్త కథను తెస్తాడా అన్నది తెలియాల్సి ఉం


మరింత సమాచారం తెలుసుకోండి: