మ్యూజికల్ సెన్సెషనల్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఇతని పేరు తెలియని వారు ఉండరు. అత్యంత అరుదైన ఆస్కార్ అవార్డును అందుకుని దేశ ఖ్యాతిని పెంచిన సంగీత విద్వాంసుడు. ఎన్నో సినిమాలకు తన స్వరాన్ని అందించి సంగీత ప్రేమికులను ఇప్పటికీ అలరిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఏఆర్ రెహమాన్ ఇంట ఒక శుభకార్యం జరిగింది. ఏఆర్ రెహమాన్ పెద్ద కూతురు ఖతీజా రెహమాన్‌కు నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 29వ తేదీన రియా సిద్దీన్ షేక్ మహమ్మద్ అనే వ్యక్తితో ఆమెకు చెన్నైలో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ విషయాన్ని ఖతీజా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

ఖతీజా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్ అయిందని, పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ చేయనట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో పెళ్లి కొద్ది రోజుల తర్వాత చేసుకోనున్నారు. నిశ్చితార్థం కూడా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే జరిగింది. పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలను ఖతీజా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ డిసెంబర్ 29వ తేదీ నాకు ఎంతో ప్రత్యేకం. ఆ రోజే నా పుట్టిన రోజు. పుట్టిన రోజే నిశ్చితార్థం జరిగింది. నా సంతోషానికి అవధుల్లేవు. నా సన్నిహితులు, బంధువులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు, ఎంగేజ్‌మెంట్ వేడుకలు జరిగాయి. మమ్మల్ని ఆశీర్వదించండి’’ అని ఆమె పేర్కొన్నారు.

అయితే రియా సిద్దీన్ షేక్ మహమ్మద్ ఎవరని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. రియా సిద్దీన్ ఒక ఆడియో ఇంజినీర్. అలాగే ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్త. ఇతను యాపిల్ ఐ ట్యూన్స్, ఎంఫిట్ సర్టిఫైడ్ సౌండ్ ఇంజినీర్. దీంతోపాటు ఫ్రీలాన్సర్‌గా కూడా పని చేస్తుంటాడు. ఏఆర్ రెహమాన్ అల్లుడు అమిత్ త్రివేదితో కలిసి కొన్ని లైవ్ కచేరిలలో పాల్గొన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, దీపికా పదుకొనే నటించిన తమాషా సినిమాలో రెహమాన్‌తో కలిసి పని చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: