టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సామాజిక స్పృహ కలిగిన సినిమాలను చేసే దర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ జోనర్ లో సినిమాలు చేయాలి అంటే సరి కొత్త రకమైన థాట్స్ సదరు దర్శకుడికి ఉండాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులకు నచ్చే విధంగా వారు సినిమాలు చేయగలరు. అలా తెలుగులో సామాజిక స్పృహను మేలుకొలిపే దర్శకుల వరస లో మొదటగా క్రిష్ ఉన్నారు అని చెప్పవచ్చు. ఎంటర్టైన్మెంట్ లో సామాజిక అంశాలను జోడించి సినిమాలు చేయడంలో ఆయన దిట్ట. 

ఆయన మొదటి సినిమా నుంచి ఇదే విధమైన విధానాన్ని అవలంబిస్తూ ఇప్పుడు భారీ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీర మల్లు చిత్రాన్ని చేస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14 తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు క్రిష్. ఎందుకంటే గత సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన అవి వారిని ఏమాత్రం మెప్పించలేక పోవడం తో ఇప్పుడు ఆయనకు హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దాంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ మెచ్చేలా చేసి మళ్లీ ఫామ్ లోకి రావాలి అనేది ఆలోచన. పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో సినిమా చేయడమే ఇక్కడ ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. భారీ అభిమానం ఉన్న హీరోతో సినిమా చేసి హిట్ కొట్టడం చాలా ఈజీ. ఆ విధంగా ఈ సినిమా విషయంలో పాజిటివ్ ఆలోచన లోనే ఉన్న క్రిష్ కొన్ని రోజులుగా కొన్ని వార్తలు వినడం ఇప్పుడు ఆయన అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది. ఈ చిత్రం ఆర్థిక కారణాలతో ఆగిపోయిందనే వార్తలు వస్తుండడంతో వీరు కూడా ఎవరు దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అసలు ఈ సినిమాకు ఏమైంది అనే కోణంలో వారు అన్వేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: