సినిమాల్లో నటిస్తూ భారీ పారితోషికాలు అందుకుంటున్న మన నటి నటులు కేవలం అక్కడికే పరిమితం కాకుండా యాడ్స్ చేసేందుకు, పలు రకాల షో రూమ్స్ ప్రారంభించడానికి భారీగా డిమాండ్ చేస్తారని పేరుంది. కేవలం ఒక్క టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్ , శాండిల్ వుడ్ మరియు బాలీవుడ్ వంటి పలు ఇండస్ట్రీలకు చెందిన వారు ఇలానే భాగా ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. 



ఇంకొంత మంది అయితే తామే స్వయంగా సినిమాల్లో వచ్చిన డబ్బును మొత్తం తమకు రంగంలో పెట్టుబడులు పెట్టి రెట్టింపు లాభాలు పొందుతున్నారు. అలాంటి వారిలో మిగిలిన చిత్ర పరిశ్రమలతో పోల్చుకుంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వారే ఇటువంటి వ్యవహారాల్లో బాగా ఆర్జిస్తూ అందరికీ దారి చూపుతున్నారు. మన టాలీవుడ్ లో హీరోయిన్స్ అయితే ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసి బాగా అర్జన చేయడం జరిగింది.



టాలీవుడ్ సీనియర్ శ్రియ శరన్ సినిమాల్లో బాగా బిజీగా ఉంటూనే  ఇప్పటికే కొన్ని చేతి  ఉత్పత్తుల వ్యాపారంల్లో పెట్టుబడులు పెట్టారు  మరియు తానే స్వయంగా చేత్తో చేసే క్యాండిల్ బిజినెస్ ప్రారంభించారు. 2018లో తన రష్యన్ ప్రియుడు, వ్యాపారవేత్త ఆండ్రి ని పెళ్లి చేసుకొన్న ఈ ముద్దు గుమ్మ తాజాగా తన భర్తతో కలిసి ఒక ఔత్సాహిక కంపెనీ లో పెట్టుబడులు పెట్టిందని తెలుస్తోంది. కంపెనీ వివరాలు , ఎంత పెట్టుబడి పెట్టిందో ఇంకా తెలియలేదు.



హోటల్ బిజినెస్ , కెరీర్ కౌన్సెలింగ్ వ్యాపారాల్లో బాగా రాణిస్తున్న భర్త సహకారంతో తొందరలోనే బిజినెస్ లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు తగినట్లుగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న ముఖ్యమైన  సమాచారం. ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉన్న ప్యాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్ తో పాటుగా పలు చిత్రాలతో బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: