స్టార్ హీరోయిన్ అయిన కాజల్ కి అరుదైన వీసా లభించిందట.యుఏఈకి చెందిన గోల్డెన్ వీసాను ఆమె పొందారు . ఈ విషయాన్ని కాజల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిందట.. యూఏఈ బేస్డ్ జుమా అల్మ్ హిరీ బిజినెస్‌ కన్సల్టేషన్‌ సంస్థ ద్వారా ఈ గోల్డెన్‌ వీసాని పొందిందట కాజల్‌. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధి మహమద్‌ షానిద్‌ అసిఫలి చేతుల మీదుగా కాజల్‌ ఈవీసాని అందుకుందట.

తమవంటి కళాకారులకు యూఏఈ మొదటి నుంచి ఎనలేని ప్రోత్సాహం అందిస్తోందని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చిందట కాజల్. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, భవిష్యత్తులో యూఏఈలో చేపట్టబోయే కార్యకలాపాల పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కాజల్ తెలిపిందట.. ఈ సందర్భంగా మహ్మద్ షానిద్ మరియు సురేశ్ పున్నస్సెరిల్, నరేశ్ కృష్ణలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించిందట..


యూఏఈ అందించే ఈ గోల్డెన్ వీసాతో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. విదేశీయులు ఎలాంటి స్పాన్సర్ షిప్ అవసరం లేకుండా యూఏఈలో ఉద్యోగాలు చేసుకోవడానికి, నివసించడానికి ఈ వీసా బాగా పనికొస్తుంది. అంతేకాదు.. గోల్డెన్ వీసా ఉన్నవారిని యూఏఈ పౌరులుగా గుర్తిస్తారట.. వారు యూఏఈలో సొంతంగా వ్యాపారాలు కూడా బాగా చేసుకోవచ్చు. ఈ వీసా ఆటోమేటిగ్గా రెన్యువల్ అవుతుంటుందట.ఇటీవల మెగా కోడలు ఉపాసన కూడా ఈ గోల్డెన్ వీసా అందుకుందట.


ఇక కాజల్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె గర్భవతి కావడంతో సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చింది. ఇటీవల ఆమె బేబీ బంప్ ఫొటోలు బయటకొచ్చాయట.మరోపక్క ఆమె నటించిన ‘ఆచార్య’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే తమిళంలో ‘హే సినామికా’ అనే సినిమా చేసింది. హిందీలో ‘ఉమా’ అనే సినిమాలో నటించింది. ఇవన్నీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయట.కాజల్ కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాజల్ బిడ్డకు జన్మకి ఇస్తుందన్న సంతోషం తో పాటు కాజల్ సినిమాలు మానేసిందనే భాదే ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: