వంశీ పైడిపల్లి మహర్షి కన్నా ముందు మహేష్ తో ఓ సినిమా అనుకున్నా అని.. కథ నచ్చినా సరే డేట్స్ కుదరక ఆ సినిమా చేయలేదని అన్నారు. అయితే వంశీ పైడిపల్లి చెప్పిన టైటిల్ కృష్ణా ముకుందా మురారి టైటిల్ చూస్తుంటే ఎన్.టి.ఆర్ తో చేసిన బృందావనం సినిమానే మహేష్ తో వంశీ పైడిపల్లి చేయాలని అనుకున్నాడా అని ఆడియెన్స్ గెస్ చేస్తున్నారు. మొదటి సినిమా మున్నా చేసిన వంశీ పైడిపల్లి సెకండ్ సినిమా బృందావనం చేశాడు. ఆ సినిమా కూడా హిట్ ఇచ్చింది.
ఒకవేళ మహేష్ కి అప్పుడు డేట్స్ అడ్జెస్ట్ చేసే అవకాశం ఉంటే మహర్షి కన్నా ముందే వంశీ పైడిపల్లి, మహేష్ కాంబో లో కృష్ణా ముకుందా మురారి సినిమా వచ్చేది. బృందావనం సినిమాలో ఎన్.టి.ఆర్ కి బదులుగా మహేష్ ని ఊహించుకుంటే చాలా థ్రిల్లింగా ఉంది. మొత్తానికి అలా మహేష్ చేయాలనుకున్న మూవీ కాస్త తారక్ ఖాతాలో పడ్డది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్ లో రాబోతుందని తెలుస్తుంది.