సినిమాలు రిలీజ్ అయి విజయం సాధిస్తే ఆ సినిమా హీరోలు కానీ, నిర్మాతలు కానీ డైరెక్టర్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నది చూస్తూనే ఉన్నాం. అయితే ఆ డైరెక్టర్ కి గోల్డ్ లేదా కార్ ఇలా ఖరీదైన బహుమతులు ఇస్తున్నారు.  అయితే తాజాగా ఖిలాడీ’ సినిమా నిర్మాత సినిమా రిలీజ్ అవ్వకముందే తమ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మకి ఖరీదైన కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. డైరెక్టర్ రమేష్ వర్మకి నిర్మాత కోనేరు సత్యనారాయణ కోటి 15 లక్షల వ్యాల్యూ గల రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇంత ఖరీదైన కారుని సినిమా రిలీజ్ అవ్వకముందే ఇవ్వడం విశేషం. ప్రస్తుతం  దీంతో ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అయితే రవితేజ హీరోగా డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఖిలాడీ'. ఇక ఈ సినిమా  రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు,హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లో భాగంగా ”రమేశ్‌ వర్మ సరికొత్త పాయింట్‌తో చెప్పిన 'ఖిలాడీ' కథ నాకు బాగా నచ్చింది. రవితేజ కి ఇది బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కథ విన్న రవితేజ కూడా కథ విని ఓకే చెప్పాడు. అంతేకాకుండా రవితేజకి కూడా కథ నచ్చడంతో వెంటనే సినిమా చేద్దామన్నారు.

అయితే రవితేజ 'మీ కెరీర్‌లో హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ రావాలని ఈ సినిమా చేస్తున్నాను' అని  చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఇటలీలో తీసిన సన్నివేశాలు చూస్తే హాలీవుడ్‌ రేంజ్‌లో అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టాము. ఇక ఇటీవల నేను 'ఖిలాడీ' సినిమా రషెస్‌ చూశాను. ఈ సినిమా కచ్చితంగా  భారీ విజయం సాధిస్తుందని అర్థమైంది. అయితే ఈ సినిమా అందుకే  రిలీజ్ అవ్వకముందే దర్శకుడు రమేశ్‌ వర్మకి కారును బహుమతిగా ఇచ్చాను.” అని తెలిపారు. అయితే ఖిలాడీ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని టీం అంతా ఫిక్స్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: