ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం పోయిన వారం విడుదలయి మిక్స్డ్ టాక్ రాబట్టుకుంది. కొన్ని సినిమాలకు జరిగే హడావుడి వల్ల అసలు విషయం పక్కదారి పట్టి అనవసరపు విషయం ఎక్కువగా ఫోకస్ అవుతుంది. దాని ద్వారా చిత్రం ఎంత బాగున్నా కూడా మెజారిటీ ప్రేక్షకులకు నచ్చిన కూడా కొంతమంది బాగోలేదు అని చెప్పడం జరుగుతుంది. ఏ సినిమాకు అయినా ఇదే ఫ్లాప్ టాక్ రావడానికి కారణం అవుతుంది.

ఇప్పటి దాకా ఇలాంటి తప్పు చాలా సినిమాల విషయంలో జరిగాయి. వెండితెరపై భారీ స్థాయిలో మ్యాజిక్ చేస్తాయని భావించిన చిత్రాలు ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి మిస్టేక్ రాధే శ్యామ్ సినిమా విషయంలో జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న తదుపరి సినిమాల పట్ల ఇప్పుడు ఒత్తిడి బాగా పెరిగింది అని చెప్పాలి ఎందుకంటే ప్రభాస్ నటించిన గత రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ ఇప్పుడు భారీ స్థాయిలో నెలకొని ఉంది. 

ఇకపోతే మారుతి దర్శకత్వంలో కూడా ఈ హీరో సినిమాలు చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. చిన్న తరహ సినిమాగా రాబోతున్న నేపథ్యంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభాస్ తో సినిమాను పూర్తి చేయాలని మారుతి ప్లాన్ గా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం స్టూడియో మరియు సెట్ లోనే పూర్తిచేసే విధంగా ప్రణాళికలు కూడా జరిగిపోయాయట. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ ను మారుతి సిద్ధం చేయించి ఏకధాటిగా షూటింగ్ చేసి ఎంత వీలైతే అంత షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ప్రభాస్ తో నటించబోతున్నారు. ఇప్పటివరకు అయితే రాశి కన్నా, మాళవిక మోహనన్ లు ఎంపిక అయ్యారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ప్రేక్షకులముందుకురానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: