తమిళ స్టార్ హీరో అజిత్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం ఈ హీరోకి తమిళంలోనే కాకుండా.. తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక ఇటీవల విడుదలైన "వలిమై" చిత్రం మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నది. ఒకవైపు ఈ సినిమా కు పాజిటివ్ టాక్ రాగా మరి కొంత మంది.. నెగటివ్ టాక్ ను కూడా పుట్టించారు.

ఇక మరి కొంత మంది మాత్రం ఇలాంటి సినిమాలు అటు ఇటు వంటి స్టార్ హీరోల చేయాల్సినవి కావు అని కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. అయితే హీరో అజిత్ పై ఇలాంటి ట్రోల్ చేస్తున్న వారికి.. ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు నిర్మాత ఆర్ కే సురేష్.. హీరో అజిత్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని ఆయన ఆగ్రహం చెందారు. ఆదివారం రోజున చెన్నైలో మాయన్ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేస్తున్నప్పుడు ఆయన అజిత్ గురించి మాట్లాడడం జరిగింది. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ సందర్భంగా ఆర్కె సురేష్ మాట్లాడుతూ.. ఫాంటసీ కథతో రూపొందించిన చిత్రం మాయన్ ఈ చిత్రాన్ని చూసి రాజమౌళి డైరెక్టర్ కూడా రాజేష్ ను అభినందించారు అని తెలిపారు. అలాగే తమిళ ఇండస్ట్రీలో ఉండే కొందరు మాత్రం మన వారిని విమర్శిస్తున్నారు అని తెలిపారు. ముఖ్యంగా స్టార్ హీరో అయినటువంటి అజిత్ నటించిన వలిమై సినిమా పై విమర్శలు ట్రోల్స్ చేయడం చాలా తప్పు అని తెలియజేశాడు. అజిత్ వంటి హీరో పై మాట్లాడే అర్హత ఎవరికీ లేదని.. కేవలం కావాలనే ఆయనపై బురద జల్లుతున్నారని తెలియజేశారు. ఈయన మాట్లాడిన మాటలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: