టాలీవుడ్ లో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన అల్లరినరేష్.. ఈ మధ్య కాలంలో తన పంథాని పూర్తిగా మార్చేసి తన శైలికి భిన్నంగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాంది సినిమాలో చాలా సీరియస్ రోల్ లో కనిపించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు నరేష్. ఇక గతంలో నటించిన గమ్యం, శంభో శివశంభో, మహర్షి సినిమాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నరేష్ కు నాంది సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చింది. విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్ కు భారీ బూస్ట్ ఇచ్చింది. 

దాంతో మరోసారి ఇప్పుడు ఓ సీరియస్ కథతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యాడు ఈ అల్లరోడు. ప్రస్తుతం అల్లరి నరేష్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి సభకు నమస్కారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇక మరొక చిత్రం ఏ ఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కి జోడిగా శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు. 

ఇక ఈ చిత్రానికి 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ఓ పోస్టర్ని విడుదల చేస్తూ టైటిల్ను రివీల్ చేశారు. ఇక ఈ క్రేజీ టైటిల్కు సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. హాస్య మూవీస్, జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ సినిమా కూడా మైల్ స్టోన్ మూవీ గా మిగిలిపోతుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ ఇలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: