ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో ఎప్పుడు చిత్ర పరిశ్రమలో కనుమరుగైన సినీ సెలబ్రిటీలను తీసుకువచ్చి ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటాడు కమెడియన్ ఆలీ. అందుకే ఇక ఈ కార్యక్రమాన్ని చూసేందుకు బుల్లితెర ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇక ఇటీవలే వచ్చేవారం ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో  అదే ఛానల్ లో పలు కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుమ గెస్ట్ గా వచ్చింది.

 సుమా ఊరికే రాలేదండోయ్.. తాను నటించిన జయమ్మ పంచాయితీ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఎంతో బిజీగా ఉంది యాంకర్ సుమ. ఈ క్రమంలోనే  ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చింది. సాధారణం గానే సుమ కెరీర్ వెండితెరపై హీరోయిన్గా మొదలయింది అన్న విషయం తెలిసిందే. తరువాత రాజీవ్ కనకాల తో ప్రేమలో పడుతుంది. పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ క్రమం లోనే కుటుంబ బాధ్యతల కారణంగా ఇక వెండితెరకు దూరం అయింది.


 కానీ కొన్నాళ్ళకి బుల్లితెరపై యాంకర్గా ప్రత్యక్షమై ఇక అలాగే సెట్ అయి పోయింది యాంకర్ సుమ. ఇక ఇప్పుడు ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్లీ వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమం లోనే ఇన్నేళ్ల  తర్వాత మళ్లీ వెండితెరపై రావడానికి  కారణం ఏంటి ఎవరిలా మారాలి అనుకుంటున్నారు అని అడుగగా.. అనుష్క సమంత రమ్యకృష్ణ రష్మిక మందన్న లాగా హీరోయిన్ గా మారాలి అనుకుంటున్నాను అంటూ  సరదా సమాధానం చెప్పింది యాంకర్ సుమ. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా విశేషాలను ఎన్నో పంచుకుంది. ఆలీతో సరదాగా కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారి పోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: