గతంలో మాటల మాంత్రికుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'అతడు'.ఈ సినిమా  ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ఈ చిత్రం మహేశ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది. ఇక ఈ చిత్రం దివంగత హీరో ఉదయ్ కిరణ్ చేయాల్సిందట.అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలుత 'అతడు' సినిమాను ఉదయ్ కిరణ్ తో చేద్దామనుకున్నారట. ఇకపోతే ఈ ఫిల్మ్ విషయమై ఉదయ్ కిరణ్ జయభేరి ప్రొడక్షన్ హౌజ్ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నారని సమాచారం. అంతేకాకుండా ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కు డేట్స్ లేకపోవడంతో సినిమా చేయలేనని త్రివిక్రమ్ కు చెప్పేశాడట.

 ఇక అలా ఈ సినిమా స్టోరిని మహేశ్ కు 'నాని' షూటింగ్ టైంలో చెప్పాడు మాటల మాంత్రికుడు.అయితే అలా అలా ఈ సినిమా ఉదయ్ కిరణ్ తిరస్కరణతో మహేశ్ బాబు వద్దకు వచ్చిందట. ఇకపోతే మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది.అయితే  ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తే చాలు..జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇకపోతే కామెడీ సీన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ జనాలకు బాగా నచ్చాయి.ఇక సుమారు 12 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.

 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ దశకు చేరినట్టు సమాచారం. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా.. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ కు విలన్ గా ఓ స్టార్ హీరో కూడా నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్. మొదలు కాబోతున్నట్లు సమాచారం పాన్ ఇండియా స్థాయిలోనే ఈ ప్రాజెక్టు ఉండబోతుందని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: