ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది హీరోయిన్ పూజా హెగ్డే.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా హిందీ, తమిళ సినిమాలలో కూడా వరుసగా నటిస్తూ బిజీగా ఉన్నది. ఇక ఇదే క్రమంలో హైదరాబాద్, ముంబై, చెన్నై ఇలా పలు ప్రాంతాలలో ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈమె కు విమానంలో ఊహించని విధంగా అవమానం జరిగినట్లుగా తెలుస్తోంది వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

పూజా హెగ్డే తన లైఫ్లో ఎప్పుడు లేని విధంగా చాలా సీరియస్ ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తోంది. పూజా హెగ్డే ఇండిగో విమానం ఎక్కిన తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఇంటికో సిబ్బంది అసభ్య ప్రవర్తన గురించి ఎప్పుడు ఫిర్యాదులపై ఆసక్తి చూపని పూజ నుండి ఇప్పుడు తనకు జరిగిన చేదు అనుభవాన్ని పెంచుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు ముంబై నుండి బయలుదేరిన మా విమానంలో విపుల్ నకాష్ అని పేరు గల వ్యక్తి మాతో ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించారని దీంతో మాకు చాలా విచారంగా ఉంది అని తెలియజేసింది.

ఎటువంటి కారణం లేకుండా మాపై అహంకారంగా ప్రవర్తించాడు అజ్ఞానంతో బెదిరింపు ఉపయోగించారని తెలియజేసింది పూజా హెగ్డే. సాధారణంగా నేను ఇలాంటి సమస్యల గురించి పోస్ట్ చేయను కానీ ఇది నిజంగా భయంకరంగా ఉంది అని పూజా హెగ్డే తన ట్విట్టర్ నుంచి తెలిపింది. నిజానికి పూజ మనసు చాలా తీవ్రంగా గాయపడితే కానీ ఇలా ఆరోపిస్తోంది అని తన అభిమానులు తెలియజేస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది తాజాగా విజయ్ దేవరకొండ తో జనగణమన చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉన్నది. ఇక మహేష్ తో కూడా ఒక సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్లో కూడా పలు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: