ఇండియన్ దర్శకులలో తమిళ దర్శకుడు మణిరత్నం కు ఒక ప్రత్యేకత ఉంది. ఈయన అందరి దర్శకులలాగా కాకుండా తనదైన వినూత్న పద్దతిలో సినిమాలు చేస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలిచారు అని చెప్పవచ్చు. రొటీన్ స్టోరీస్ తో సినిమాలు చూస్తూ బోరుకొట్టే ప్రేక్షకులకు మణిరత్నం చిత్రాలు కొత్తదనం తో కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ దర్శకుడు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాగా ఇపుడు ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొన్నియన్ సెల్వన్ అనే టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఆ చిత్రం లో ఐశ్వర్యా రాయ్, విక్రమ్, కార్తి, త్రిష, జయం రవి, బాబీ వంటి బడా బడా స్టార్లు నటిస్తున్నారు.

తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం సెప్టెంబర్ 30 న విడుదల కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకోగా ఈ సినిమాలో ఇపుడు ఒక టాలీవుడ్ స్టార్ హీరో కోసం ఒక స్పెషల్ రోల్ యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు అని అంటున్నారు. నిజానికి ఇది ముందు స్టోరీ లో లేదు కానీ ఇపుడు స్టోరీ లైన్ ను మరింత బలంగా మలిచేందుకు ఒక కీ రోల్ యాడ్ చేయగా ఆ పాత్ర కోసం యంగ్ హీరో సత్య దేవ్ ను ఎంపిక చేసినట్లు అంటున్నారు.

ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక తాజాగా ఈ యంగ్ హీరో నుండి నిన్ననే గాడ్సే అనే మూవీ రిలీజ్ అయింది. సమాజంపై మరోసారి చేసిన ఈ మూవీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే కలెక్షన్ లు ఎంతవరకు వస్తాయి అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: