SMS సినిమాతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రెజీనా కాసాండ్రా. ఈ సినిమా తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, తదితర సినిమాలలో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే అందం అభినయంలో ఉన్న తెలుగు పరిశ్రమలు ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుందని చెప్పవచ్చు.. కేవలం గ్లామర్ షోలకి మాత్రమే కాకుండా కంటెంట్ ఉండే సినిమాలలో కూడా నటించి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఎంతోమంది ప్రశంశాలు అందుకున్నది. వాడు సినిమాలలోనే కాకుండా తాజాగా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ మరింత ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


తాజాగా ఆలీతో సరదాగా షో లో పాల్గొన్న రెజినా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. రెజినా మాట్లాడుతూ స్కూల్లో తను లీడర్ గా ఉంటున్న సమయంలో అబ్బాయిలను ఎక్కువగా కొట్టేవాదాన్ని.. అలాంటి సమయంలో చాలామంది అబ్బాయిలు  తను అబ్బాయిలను డామినేటింగ్ చేస్తుంది అని చెప్పేవారని తెలిపింది. అందరూ తన ఫిజిక్ చూసి డామినేటింగ్ చేస్తుంది అనుకునేవారని తెలియజేస్తుంది. ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి గారి ఈ వయసులో కూడా అంత డ్యాన్స్ వేయడం అంటే నేను ఆ డ్యాన్సుని చూసి చాలా ఆశ్చర్యపోయానని తెలియజేసింది. కానీ తనకు పాత్ర నచ్చితే ఆ పాత్ర కోసం ఎందాకైనా ఏమైనా చేస్తానని తెలిసింది.


ఇక అంతే కాకుండా 2019వ సంవత్సరంలో కులుమనాలి లోని ఒక హోటల్లో  ఐ మాస్క్ ధరించి నిద్రపోతున్న సమయంలో.. తన తల మీద ఉన్న వెంట్రుకలను ఎవరు పక్కకు జరిగినట్టుగా అనిపించింది అని.. మాస్క్ తీసి చూస్తే అక్కడ ఎవరూ లేరని కూడా తెలియజేయండి. దాంతో తను ఆ రోజంతా చాలా భయపడిపోయారు అని తెలిపింది. ప్రస్తుతం రెజీనా నేనే నా .. శాకిని.. డాకిని వంటి సినిమాలో నటిస్తున్నది. అయితే తనకి పాత్ర నచ్చితే ఆ సినిమాలో విలన్ గా చేయడానికి అయినా సరే ఒప్పుకుంటానని తెలియజేసింది రెజినా..

మరింత సమాచారం తెలుసుకోండి: