కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమా అందరికీ తెలిసిందే. అది ఎంత పెద్ద విజయాన్ని సాధించింది అంటే తమిళ నట ఇటీవలే అంతటి కలెక్షన్స్ సాధించిన సినిమానే లేదు. ఆ విధంగా కమల్ కు కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని చాలా రోజుల తర్వాత తెచ్చిపెట్టింది. ఆ విధంగా కమల్ హసన్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మంచి లాభాలను పొందాడు. ఇకపోతే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి కూడా వచ్చింది. ప్రేక్షకులను ఎంతో అలరిస్తూ ఇక్కడ కూడా మంచి సినిమా గా ముందుకు పోతుంది.

నిన్న అర్థరాత్రి ఈ సినిమా విడుదల కాగా రికార్డు స్థాయి లో ఈ చిత్రానికి వ్యూస్ లభిస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ ఈ సినిమా కి దర్శకత్వం వహించిన తీరు చాలా బాగుంది. అందరు కూడా దీన్ని ఎంతో ఆస్వాదించారు అంటే కారణం అయన స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కమల్ హసన్ ఇంతటి పెద్ద విజయాన్ని అందుకోవడం అయన అభిమానులను ఎన్థొహ్ అలరిస్తుంది. ఈ సినిమా లో విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ మరికొన్ని కీలక పాత్రలలో నటించడం విశేషం.

సూర్య ఈ సినిమా యొక్క చివర్లో ఎంట్రీ ఇచ్చి చిత్రాన్ని ఇంకా హిట్ అయ్యేలా చేశాడని చెప్పొచు. దాంతో ఈ సినిమా సీక్వెల్ గా వచ్చే చిత్రం పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయ్. ఇండియా లో తొలిసారి మల్టీ వర్స్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చిన ఘనత ఈ దర్శకుడికే దక్కింది అని చెప్పొచ్చు. మరి రాబోయే సినిమాలతో ఈ దర్శకుడు ఎలాంటి వండర్స్ సృస్తిస్తాడో చూడాలి. ఇకపోతే ఈ సినిమా కి సీక్వెల్ కంటే ముందు లోకేష్ విజయ్ దళపతి తో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా యొక్క సీక్వెల్ గురించి అయన అలోచిన్చాబోతున్నారు. మరి కమల్ హసన్ ఈ లోపు ఇంకో సినిమాజోష్ లో చేయాలనీ చూస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: