ఇక ఏ హీరో అయినా సరే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి చాలా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే మంచి ఫేమ్ రావడమే కాకుండా భారీ స్థాయిలో పారితోషకం అనేది కూడా ఉంటుంది.అయితే రాజమౌళితో సినిమా అంటే ఖచ్చితంగా కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ కూడా సుమారుగా రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతుంది.. ఇక అప్పటివరకు కూడా జక్కన్న సినిమా పైన ఆధారపడక తప్పదు. కానీ కొంచెం ఓపికతో ఉంటే మాత్రం దేశం గర్వించదగ్గర నటుడు అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్, రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ లాంటి హీరోలు ఆల్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం.ఇకపోతే ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారి ఒక సినిమా చేయబోతున్నాడు. నిజానికి పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాను కేవలం 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కెక్కించి ఏకంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ లో పెద్ద సెన్సేషన్ రికార్డు సృష్టించాడు మహేష్ బాబు. ఇక ఇప్పటికే రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోలు కూడా వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు చిత్రీకరిస్తున్నా పెట్టుబడి కూడా సాధించలేకపోతూ ఉండడం ఇంకా అలాంటి సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలాంటి రికార్డులు సృష్టించడం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.


ఇక ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు. ఇక జక్కన్న రాజమౌళి కూడా ఎప్పుడు లేని విధంగా ఈసారి సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్ ని ఈ సినిమాలో వాడబోతున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ పనులు అన్నీ కూడా పూర్తయ్యాయి. ఇంకా ఫైనల్ టచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిసారి తన కెరీర్ లోనే అత్యధిక పారితోషికం తీసుకోబోతున్నారని సమాచారం. ఏకంగా ఆయన రాజమౌళి సినిమా కోసం మొత్తం రూ.80 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారట. అలాగే సినిమాని పాన్ వరల్డ్ రేంజిలో తీయబోతున్నాడు.ఇక ఇదే నిజమైతే సూపర్ స్టార్ మహేష్ రేంజ్ పాన్ వరల్డ్ లెవెల్ లో మారు మ్రోగిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: