మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  త్రిపుల్ ఆర్ తర్వాత వరుస సినిమాలలొ నటిస్తున్నారు.. చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ను అత్యంత భారీ బడ్జెట్‌ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తోంది.. ఇటీవల పంజాబ్‌ లోని అమృత్‌సర్‌ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, తన నెక్ట్స్ షెడ్యూల్‌ ను హైదరాబాద్‌ లో జరుపుకోబోతుంది.


ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాడు హీరో రామ్ చరణ్. కాగా, తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం అందాల భామ కియారా అద్వానీ కూడా హైదరాబాద్‌ లో ల్యాండ్ అయ్యింది. ఈ సినిమా ను దర్శకుడు శంకర్ తనదైన మార్క్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండ గా, ఇందులో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా లో కియారా పాత్ర ఎలా ఉండ బోతుందనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది... గతంలొ చెర్రి తో వినయ విధెయ రామ సినిమా లో నటించింది..


సినిమా లో భారీ తారాగణం ఉండగా, ఈ చిత్రాని కి థమన్ సంగీతం అందిస్తున్నాడు. జూలై 13 నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుండ గా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా షూటింగ్‌ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.. ఈ సినిమా పై భారీ అంచనాల ను పెంచేశారు.. మొత్తాని కి ఈ సినిమా కథ ఆసక్తి కరంగా ఉందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.. ఇక శంకర్ ఎలా సినిమా ను చూపిస్తాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: