నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన 107 సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మొదటి సినిమా. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, దునియా విజయ్మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇది వరకు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ మూవీ లో జయమ్మ పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ పాత్రతో ఎంతో మంది ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుండటంతో ఆమె పాత్రపై కూడా సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇది ఎలా ఉంది ఈ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు గతంలో అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే.

అయితే ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండడం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ సినిమాను దసరా భారీ నుండి తప్పించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అఖండ సినిమా విడుదల చేసిన డిసెంబర్ 2 వ తేదీనే విడుదల చేయాలని చిత్రబృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2 వ తేదీన విడుదల అయిన అఖండ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఆ సెంటిమెంట్ తోనే డిసెంబర్ 2 వ తేదీన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాను కూడా విడుదల చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: