ప్రస్తుత పరిస్థితుల్లో ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఒక సినిమా సక్సెస్ అయ్యే వరకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్న ... ఆ తర్వాత చేసిన ఒక్క సినిమా హిట్ అయినా చాలు.. వారు అమాంతం రేటు పెంచేస్తున్నారు..ఇక ఇప్పుడు సక్సెస్ వచ్చిందంటే రెమ్యునరేషన్ కోట్లలో పెంచేస్తున్నారు. హీరోయిన్ విషయం కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు.. ఇక వీరు కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను బాగా పాటిస్తున్నారు.ఇదిలావుంటే ఒకప్పుడు లక్షల్లో అందుకున్న వారు కూడా సక్సెస్ వస్తే కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు.. మరి ముఖ్యంగా పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటే ఇక వారి డిమాండ్ మరింత పెరిగి పోతుంది..

ఇక  ఆ హీరోయిన్స్ ఐదు కోట్లకు పైగానే డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా  ఇప్పుడు కేజిఎఫ్ సిరీస్ తో సక్సెస్ అందుకున్న శ్రీనిధి శెట్టి కూడా పారితోషికం భారీగా పెంచినట్టు వార్తలు వస్తున్నాయి.ఇకపోతే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యష్ హీరోగా నటించగా..ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది..కాగా కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 కూడా తెరకెక్కించాడు నీల్..పోతే  ఈ రెండు సిరీస్ లలో ఈమె హీరోయిన్ గా నటించడంతో ఈమెకు పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.

అయితే మరి అదే పాపులారిటీతో ఈమెకు వచ్చిన అవకాశాలకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి చాలా అవకాశాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు కోలీవుడ్ హీరో విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో నటిస్తుంది. ఇక మరి ఈ సినిమాలో ఈ అమ్మడు ఏకంగా 6 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు టాక్ కొనసాగుతుంది. నిజంగా ఈ బ్యూటీకి అంత డైమండ్ ఉందా.. అనే విషయంపై ఇప్పుడు అందరు చర్చించు కుంటున్నారు..ఇకపోతే కేజిఎఫ్ లో ఈమె చూపించిన టాలెంట్ ఏమీ లేదు.. కేవలం ఆ సినిమా హిట్ అవ్వడంతో ఈమె కూడా పాపులర్ అయ్యింది..ఇక దీంతో ఈమెకు 6 కోట్లు ఇచ్చి మరీ కోబ్రా సినిమాలో తీసుకుని ఉంటారా.. అనేది అందరి ప్రశ్న..అయితే  ఇది కేవలం రూమర్ అని మాత్రమే తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాతో విక్రమ్ కూడా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: