అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సంవత్సరాల క్రితం జులాయి సినిమా తెరకెక్కింది. ఈ మూవీ లో ఇలియానా , అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించింది .

సినిమా అప్పట్లో సూపర్ హిట్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా ఈ మూవీ మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సన్నాఫ్ సత్యమూర్తి అనే మూవీ తెరకెక్కింది. ఆ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి అలా వైకుంఠపురంలో సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది. అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరి పోయే కలెక్షన్ లను కూడా కొల్ల గొట్టింది.

మూవీ లో  అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.  ఇలా ఇప్పటికే మూడు సార్లు విజయాలను అందుకున్న ఈ క్రేజీ కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక యాడ్ షూట్ జరుగుతుంది. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ భారీ బ్రాండ్‌ కి సంబంధించిన యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ యాడ్ షూటింగ్ హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: