టాలీవుడ్ యువర్ హీరో టాలెంటెడ్ హీరోగా పేరుపొందిన నిఖిల్ నటించిన తాజా చిత్రం.. కార్తికేయ-2 ఈ సినిమాని యువ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక అగర్వాల్ టి.జీ విశ్వప్రసాద్ నిర్మించారు. 2014వ సంవత్సరంలో వచ్చిన మిస్టర్ త్రిల్లర్ కార్తికేయ.. సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది.. ఇక ఈ సినిమా సీక్వెల్ లో అనుపమ పరమేశ్వర హీరోయిన్గా నటిస్తున్నది. బాలీవుడ్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.


ఇప్పటికే ఈ  సినిమా నుంచి విడుదలైన పలు టీజర్స్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఇక శ్రీకృష్ణుడికి సంబంధించిన రహస్యాలను ఛేదించే నేపథ్యంలో ద్వారకా చుట్టూ సాగే కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతోంది. ముందు ఈ సినిమాని జూలై 22న విడుదల చేయాలని భావించినప్పటికీ.. అయితే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించడంతో ఈ సినిమా విడుదలకు ఇదే  సమయం అని ఫైనల్ చేశారు. అయితే నాగచైతన్య థాంక్యూ సినిమా అదే రోజున విడుదల కావడంతో దిల్ రాజు రిక్వెస్ట్ మేరకు ఈ సినిమాని ఆగస్టు 12 కు పోస్ట్ ఫోన్ చేశారు.


సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఈ మూవీ సెన్సార్ కు పంపించారు ఇక ఈ రోజున సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది ఒక్క కట్ కూడా విధించకుండా ఈ సినిమాకి యూఏఈ సర్టిఫికెట్ లభించడం జరిగింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు సెన్సార్ సభ్యులు చిత్ర బృందాన్ని అభినందించి సినిమాలో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయని  తెలియజేసినట్లుగా చిత్ర బృందం తెలిపారు. ఇక ఈ సినిమాలో ఆలోచన ప్రయత్నించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర బృందాన్ని అభినందించినట్లుగా మేకర్స్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: